Pages

Thursday, August 15, 2013

స్మరించే వారి వెన్నంటే ఉంటా!

స్మరించే వారి వెన్నంటే ఉంటా!
నలుగురు గుడ్డివాళ్లు ఏనుగును నాలుగు రకాలుగా వర్ణించిన కథ మనకు తెలుసు. అంధత్వం వల్ల వారు తాము చేత్తో తాకి పట్టుకున్న అవయవాన్నే మొత్తం ఏనుగుగా వర్ణించారు. మనం కళ్లుండి కూడా అజ్ఞానమనే అంధత్వం వల్ల దైవాన్ని సరిగా చూడలేకపోతున్నాం. మనకు తోచిందే సరైనదనే నమ్మకం మనది. ఈ ధోరణితో గడిపినంత కాలం భగవంతుడ్ని చూడలేం. భగవంతుడే ఎదురుగా నిలుచున్నా, ' దేవుడంటే ఫలానా విధంగా ఉంటాడు.. నా ఎదురుగా ఉన్నది ఆయన కాదు' అనే అజ్ఞానంలో పడిపోతాం.
బివి దేవు తన ఇంట జరగనున్న ఉద్యాపన వ్రతానికి బాబాను ఆహ్వానిస్తూ బాపూ సాహెబు జోగుకు లేఖ రాశాడు. దానిని జోగు బాబాకు చదివి వినిపించాడు. ' నన్నే స్మరించే వారిని మరువను. నాకు బండి కానీ, రైలుకానీ, విమానం కానీ అవసరం లేదు. ప్రేమతో పిలిచే వారి చెంతకు పరుగున వెళతాను. నువ్వు, నేను, మరొకరు సంతర్పణకు వస్తామని రాయి' అని బాబా జోగుకు సూచించారు. నిజానికి బాబా ఎప్పుడూ రహతా, రుయీ, నీమ్‌గాం తప్ప షిర్డీ విడిచి మరెక్కడికీ వెళ్లిన దాఖలాల్లేవు. కాబట్టి తన ఉద్వాసనకు బాబా వస్తారా? అని దేవు సందే హించాడు.
ఉద్యాపనకు కొద్దిరోజుల ముందు బెంగాలీ సన్యాసి దహను రైల్వే స్టేషన్‌లో దిగారు. స్టేషన్ మాస్టర్‌ను కలిసి గో సంరక్షణకు చందాలు వసూలు చేసే నిమిత్తం వచ్చానని చె ప్పారు. దహను మామల్తదారు దేవును కలిస్తే చందాల వసూలు కార్యక్రమం ఫలప్రదమవుతుందని స్టేషన్ మాస్టారు చెప్పాడు. అనుకోకుండా దేవు అక్కడికే వచ్చాడు. సన్యాసి విషయం చెప్పగానే ప్రస్తుతం ఊళ్లో మరో రెండు మూడు చందా వసూళ్లు జరుగుతున్నాయని, కాబట్టి రెండు లేదా మూడు నెలలు ఆగి వస్తే పనవుతుందని చెప్పాడు.
నెల తరువాత బెంగాళీ సన్యాసి టాంగాలో వచ్చి దేవు ఇంటి ఎదురుగా దిగారు. ఉద్వాపన పనుల్లో ఉన్న దేవు ఆయన చందాల పనిపై వచ్చి ఉంటారని తలచాడు. సన్యాసి దేవు భావం గ్రహించినట్లు తాను చందాల కోసం రాలేదని భోజనానికి వచ్చానని చెప్పాడు. దేవు మనస్పూర్తిగా స్వాగతం పలికాడు. తనతో పాటు మరో ఇద్దరు కూడా ఉన్నారని, వారిని కూడా తీసుకుని మధ్యాహ్నం 12 గంటలకు వస్తానని చెప్పి సన్యాసి వెళ్లిపోయాడు. చెప్పినట్లే సన్యాసి మరో ఇద్దరితో వచ్చి మధ్యాహ్నం 12 గంటలకు దేవు ఇంట భోజనం చేసి వెళ్లిపోయాడు. ఉద్యాపన వ్రతం పూర్తి కాగానే దేవు అసంతృప్తికి గురయ్యాడు. బాబా వస్తానని మాటిచ్చి నిలుపుకోలేక పోయారని జోగుకు లేఖ రాశాడు. యథావిధిగా జోగు ఆ లేఖలోని సారాంశాన్ని బాబాకు చెప్పడానికి మసీదుకు వెళ్లాడు. అతను లేఖను చదవకముందే బాబా ఇలా అన్నారు.
" దేవు ఏమంటున్నాడు? నేను దగా చేశానంటున్నాడా? ఇద్దరితో కలిసి నేను సంతర్పణకు వస్తానని చెప్పలేదా? చెప్పినట్లే సంతర్పణకు వచ్చింది నిజం కాదా? రమ్మని పిలువనేల వచ్చిన తర్వాత పోల్చుకోనేల? నన్ను చూడగానే చందాల కోసం వచ్చిన సన్యాసిని అనుకున్నాడు. నేను భక్తులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ప్రాణాలనైనా విడుస్తాను '' బాబా సమాధానాన్ని పేర్కొంటూ జోగు తిరిగి దేవుకు లేఖ రాశాడు. బాబా రాకను పసికట్టలేకపోయినందుకు దేవు చింతించాడు. తన పట్ల భక్తుల మనసెంత స్థిరమో, విశ్వాసమో సాయి పరీక్షిస్తారు. అన్నింటిలోనూ, అంతటా తనను దర్శిస్తున్నారా? లేదా? అని బాబా చూస్తారు. ఆ విశ్వాస పరీక్షలో నెగ్గిన వారు బాబా కృపకు పాత్రులు. వారే ధన్యులు.
సాయిపై విశ్వాసం ఉంటే సాధించలేనిది లేదు బాబా దయగల తండ్రి. ప్రేమను పంచే మాతృహృదయుడు. బాబా కరుణా కటాక్షాల కోసం మనం ఎన్నో విధాలా వేడుకుంటాం. ప్రార్థిస్తాం. మన కష్టసుఖాలను మొరపెట్టుకుంటాం. 'కొట్టినా పెట్టినా నువ్వే బాబా!' అని సర్వ శ్రేయోదాయి సాయిని అర్థించిన చేతులతోనే కొన్నిసార్లు బాబా మాటలు కాదని మన చేతుల్ని హస్తసాముద్రికులు, జోతిష్యుల చేతిలో పెడతాం. సాయి సచ్ఛరిత్రలో జ్యోతిషాలను నమ్మవద్దని బాబా చెప్పిన ఉదంతాలు రెండు మూడు ఉన్నాయి. జోతిష్యాల ఆకర్షణలో, గ్రహశాంతుల ఊబిలో పడవద్దని బాబా తన భక్తులకు పదే పదే చెప్పారు. సాయి కృపను పొందడానికి, సాయిపథంలో నడవడానికి విశ్వాసమే తొలిమెట్టు. మనం సాయిపథంలో నడవాలంటే బాబా చెప్పిన విషయాలను తు.చ తప్పకుండా పాటించాలి. బాబా పైనే విశ్వాసం ఉంచాలి.'నిన్ను నవ్వు నమ్ముకో నీలోని భగవంతుడ్ని నమ్ముకో' అనేది బాబా ఉపదేశం. మనలోని భగవంతుడు సాయినాథుడు కనుక మన భారాలు, విచారాలు అన్నిటినీ బాబాపైనే వేద్దాం. మన జీవిత నౌకను మోక్షమనే తీరానికి క్షేమంగా దరిచేర్చే బాధ్యతను బాబాయే తీసుకుంటారు.
సావిత్రీబాయి టెండూర్కర్, రఘునాథ్ టెండూర్కర్‌ల కుమారుడు బాబు టెండూర్కర్. బాబు వైద్య విద్య రెండవ సంవత్సరం చదువుతుండగా జోతిష్యులు అతని జాతకచక్రాన్ని చూశారు. ఆ సంవత్సరం గ్రహాలు అనుకూలంగా లేవని, ఎంత చదివినా ప్రయోజనం లేదని వారు పెదవి విరిచారు. మరుసటి సంవత్సరం కష్టపడి చదవనవసరం లేకుండానే ఉత్తీర్ణుడవుతాడని కూడా వారు చెప్పారు. ఆ మాటలు విని బాబు దిగులు, ఆందోళనలకు గురయ్యాడు. ఆ రోజునుంచి చదవడం మానేసి నిర్లిప్తంగా గడపడం మొదలె ట్టాడు. కుమారుని వాలకం చూసి సావిత్రీబాయి కలత చెందింది. ఆమె మనసు తల్లడిల్లింది. రఘునాథ్ కూడా కొడుకుని చూసి బెంగపెట్టుకున్నాడు. సావిత్రిబాయి కూడా ఎన్నో విధాలా నచ్చచెప్ప చూసి విఫలమైంది. కష్టంలోనూ సుఖంలోనూ తమ వెన్నంటి ఉండే బాబా వద్దకు వె ళ్లింది. కొడుకు పరిస్థితి బాబాకు చెప్పి కంటతడి పెట్టుకుంది. బాబా హృదయం ద్రవించింది.
'జాతకాలు, జన్మకుండలిని పట్టించుకోవద్దు. సాముద్రికాన్ని చూడొద్దు. నా పై విశ్వాసం ఉంచి బుద్దిగా చదువుకోమను. ఈ సంవత్సరమే అతను ఉత్తీర్ణుడవుతాడు'. అని బాబా అభయం ఇచ్చారు. సావిత్రి వెంటనే ఇంటికి వెళ్లిపోయి బాబా మాటల్ని బాబుకు చెప్పింది. బాబా ఇచ్చిన అభయంతో బాబు ఆత్మవిశ్వాసాన్ని నింపుకున్నాడు. శ్రద్దగా చదివాడు. పరీక్షలు కూడా రాశాడు. కానీ, ఉత్తీర్ణుడ్ని అవుతాననే నమ్మకం మాత్రం లేదు. అందుకే పరీక్షా ఫలితాలు విడుదలైనా చూసుకోలేదు. ఓ మిత్రుడు వచ్చి పరీక్షలో ఉత్తీర్ణుడివి అయ్యావని, ఇంటర్వ్యూకు కూడా పిలుపు వచ్చిందిన బాబుతో చెప్పాడు. బాబాపై ఉంచిన నమ్మకమే బాబును గట్టున పడేసింది. బాబాపై మన విశ్వాసం చెదిరిపోనిదే అయితే మనం సాధించేలేనిది ఏమీ లేదు. సాయినాథాయ నమః

సాయి కటాక్షంతోనే ఈ జన్మకు మోక్షం....

సాయి కటాక్షంతోనే ఈ జన్మకు మోక్షం
ఈ విశ్వమే ఓ అద్భుతం .అందులో మానవ జన్మ మరీ విశిష్ట౦. స్వర్గం, నరకం, భూమి , ఆకాశాన్ని సృష్టించిన భగవంతుడు జీవకోటికి ప్రాణం పోశాడు .ప్రాణులకు నిద్ర, ఆకలి , భయం , ఆహారం , సంభోగం ......ఇవన్ని సహజమే ! చీము , రక్తం ,మాలాలతో నిండి ఉండే ఈ శరీరం చివరకు శిథిలమై మరణానికి చేరువవుతుంది .అయితే మిగతా ప్రాణులతో పోలిస్తే మానవుడు కొంత విశిష్టమైనవాడు .ఎందుకంటే భగవంతుడు అతనికి ప్రజ్ఞ అనే విషయాన్ని బహుకరించాడు .అదే జ్ఞానం.దీని సాయంతోనే మనిషి మోక్షగామి కాగలిగాడు .తనలోని జ్ఞానాన్ని ఉపయోగించి మనిషి మోక్షసాధనకు ప్రయత్నిస్తే పుణ్యం కలుగుతుంది .జ్ఞానాన్ని మరుగుపరుచుకుని అజ్ఞానంతో బతికితే నరకమే ప్రాప్తి .లేదంటే జంతుజన్మే గతి .పాపపుణ్యాలు సమానంగా ఉన్నప్పుడే భూమిపై తిరిగి మనిషిగా జన్మిస్తాడు .పుట్టుక కాని , మోక్షం కాని మనిషి చేసుకునే కర్మలపైనే ఆధారపడి ఉంటుంది .శరీరాన్ని ముద్దు చేస్తే అది విషయ సుఖాల వెంట పడుతుంది .అలా అని దానిని అశ్రద్ధ చేయకూడదు . రౌతు తన గమ్యాన్ని చేరే వరకు తన గుర్రాన్ని ఎంత జాగ్రత్తగా కనిపెట్టి చూసుకుంటాడో ఈ శరీరాన్ని మనం కూడా అంతే జాగ్రత్తగా చూసుకోవాలి .ఈ శరీరాన్ని ఆత్మసాక్షాత్కారం , మోక్షసాధనకు వినియోగించటమే మనిషి పరమావధి కావాలి . భగవంతుడు ఈ భూమిపై కోటానుకోట్ల జీవజాలాన్ని సృష్టించాడు .కానీ, అవేవీ భగవంతుని శక్తిని గుర్తించలేకపోయాయి . అందుకే మనిషికి జ్ఞానమనే ప్రతేక శక్తినిచ్చి భూమిపై వదిలాడు. ఆ జ్ఞాన౦ సాయంతో మనిషి వివేకాన్నేరిగి తన లీలన్ని, కీర్తిని గానం చేస్తుంటే భగవంతుడు ఎంతో పరవశం చెందుతాడు . మానవజన్మ లభిచటం చాలా గొప్ప అదృష్టం .ఎంతో పుణ్యం చేసుకుంటే మనకీ జన్మలభించింది .చివరకు ఈ జన్మను చూసి దేవతలే ఈర్ష్య పడతారట. తాము భూమిపై మానవ జన్మనెత్తి మోక్షం పొందాలని కోరుకుంటారట. ఇంతటి శ్రేష్టమైన జన్మను పొందిన మనిషి మోక్ష సాధనకు ప్రయత్నం చేయాలి కానీ ,మనదంతా ఉరుకులపరుగుల జీవినం.భగవంతుడిని గుర్తుచేసుకునే ఓపికే తీరిక ఎవ్వరికి లేవు.అర్ధం లేనిపోటి ,ఇతరులతో పోలికా , వాదులాట , వంతులు, ఒత్తిడి ఆరాటం మనిషి జ్ఞానాన్ని మరుగునపరుస్తున్నాయి .ఎంత సేపు నాలుగు రాళ్ళు వేనకేసుకుందామనే ఆశ !రెండు దెబ్బలు తగలగానే 'దేవుడా !ఉన్నావా ?ఉంటే నాకెందుకు ఇన్ని కష్టాలు?ఇవన్నీచూస్తూ కుర్చున్నావా ?నీ దర్శననికి వస్తా ..నా కష్టాలు తీర్చు 'అని ఎడతెగకుండా ప్రార్ధనలు చేస్తాం .అంతా సవ్యంగా జరిగిపోతుంటే 'అంతా నా ఘనతే 'అని మనకు మనమే కితబిచ్చుకుని మురిసిపోతా౦. ఇదేనా జీవితం ?దీనికి ముందు వెనుకా మరేమి లేవా ?ఈ ప్రశ్నలు కు సమాధానమే సాయితత్వం .మనిషికి జీవిత పరమావధి ఏమిటి? మోక్ష సాధనకు మార్గమేది ?ఆత్మ సాక్షాత్కారం పొందటం ఎలా ?ఈ జన్మను ఈ భూమిపైనే చరితార్డం చేసుకోవటం ఎలా ? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసునే ముందు షిర్డీ సాయిబాబా గురించి తెలుసుకోవాలి .బాబా సమర్ధ సద్గురువు .బాబా జీవనశైలి , వైఖరి, లీలల్లోని పరమార్ధాన్ని మొదట అర్ధం చేసుకోవాలి . ఆ తరువాత బాబా సూచించిన ఆదర్శ జీవన బాటలో నడిచే ప్రయత్నం చేయాలి .అపుడు మనకుతెలియకుండానే బాబా మన వేలు పట్టి మోక్ష మార్గంలోనడిపిస్తారు.అపుడు సాయిపథాన్ని అనుసరించగలుగుతాం .

శ్రీ సాయిబోధ .....


శ్రీ సాయిబోధ .....
ఓటమి నుండి ఓంకారమునకు :
నిజానికిదంతా సాయిబాబా లీల మాత్రమే. తన సంపూర్ణ వైరాగ్యజీవిత ప్రవర్తన కోసం తంబోలీని నెపముగా పెట్టుకున్నారే గాని నిజానికాయనను ఓడించగల వాళ్ళెవరూ లేనేలేరు. అలనాడు శ్రీ కృష్ణుడు జరాసంథునికి ఓడిపోయినట్లుగా కల్పించుకుని తన రాజధానిని మధుర నుండి ద్వారకకు మార్చుకొన్నట్లు ఇది కూడా సాయిబాబా లీలే తప్ప మరొకటి కాదు. అందువల్లనే ఆ ఓటమిని అడ్డు చేసుకుని శ్రీ బాబా మరింత విరాగిగా ఉండిపోయారు. అప్పటి నుంచి సాయిబాబా పద్ధతి చాలా మారిపోయింది. ధోవతీలను మానేశారు. లంగోటా బిగించుకుని పైన పొడవైన తెల్ల చొక్కా ముతకది ధరించేవారు. తలకొక గుడ్డను కట్టుకుని దానిని వెనుక నుంచి ఎడమవైపుకు చుట్టుకునే వారు.
అప్పటి దాకా ఆపదలో ఉన్నవాళ్ళకి సాయం చేయడం, రోగులకి ఉచిత వైద్యం అందించడం, దెయ్యాల వలన, గ్రహదోషాల వలన పీడించబడేవారిని కాపాడటం, ఇటువంటి వాటివల్ల షిరిడీలో ఆయన ``మంచివాడు'' అనీ, పరోపకారస్ధుడనీ పేరు పడ్డారు. ఆయననెంతగా ఆరాధించినా బాయ్‌జాబాయి దృష్టిలో ఆయన ఆమెకు తము్మడే. ఆమె కుమారుడు తాత్యాకు మేనమామే. మహల్సాపతి వంటి ఒకరిద్దరు దృష్టిలో మాత్రం ఆయన యోగి, అవతారపురుషుడూ సామాన్య ప్రజలు కూడా ముందుగా ఆయనను యోగిగానే గుర్తించారు.

అద్భుతయోగం - ధౌతి :
యోగ అభ్యాసపరులు తమ శరీరం యొక్క లోపలి భాగాలను శుభ్రం చేసుకునేందుకు గాను మూడు అంగుళాల వెడల్పూ, ఇరవైరెండున్నర అంగుళాల పొడవు వుండే గుడ్డను మింగి ఒక అరగంట సేపు దానిని కడుపులోనే ఉండనిచ్చి అనంతరం బయటికి తీస్తూ ఉంటారు. ఈ యోగ విద్యను ``ధౌతి'' అంటారు. సాయిబాబా కూడా ఇలాంటి ``ధౌతి''ని చేసుకునేవారు. కాని, వారి ధౌతీ చాలా విచిత్రంగా ఉండేది. మసీదుకు రవంత ఎడంగా ఒక బావి ఉంది. ఒక రోజున సాయిబాబా ఆ బావి దగ్గర తను ధౌతీని నిర్వహించారు. అది గుడ్డ మింగడం కాదు. సరాసరి తమ ఊపిరితిత్తలను బయటకు కుక్కి, నీళ్ళతో శుభ్రం చేసి పక్కనే ఉన్న నేరేడు చెట్టు మీద ఆరేశారు. ఆరగానే మళ్ళీ తనలోకి అమర్చుకున్నారు. ఈ అద్భుతమైన ధౌతీని కొందరు ప్రత్యక్షంగా చూడడంతో బాబా పట్ల వారికి విపరీతమైన భయభక్తులు ఏర్పడ్డాయి. అటువంటిదే మరో దివ్యయోగం.
ఖండయోగం :
ఒక విశ్రాంతి రోజు రాత్రి, శ్రీ సాయిబాబా తమ శరీర అవయవాలు అన్నిటినీ కాలికి కాలు, చేయికి చేయిగా వేరు చేసి మసీదులోని వేరు వేరు స్ధలాలలో వుంచారు. ఈ సంగతి తెలియని గ్రామ పహరాదారైన అప్పాభిల్‌ తన విధి నిర్వహణలో మసీదుకు వెళ్ళి, చెల్లాచెదురుగా పడివున్న అవయవాలను చూసి హడలిపోయాడు. బాబానెవరో ఖండఖండాలుగా నరికేశారని ఊహించాడు. కాని ఆ సంగతి తను బయటపడితే నేరం తన మీద పడుతుందేమోనన్న భయంతో మౌనంగా వుండిపోయాడు. మర్నాడు మసీదుకు వెళుతున్న జనంతోపాటు తాను కూడా ఏమీ తెలియని వాడి లాగానే వెళ్ళాడు. తీరావెళ్ళే సరికి బాబా దర్బారు తీరి ఉన్నారు. ఆయన గద్దె మీద ఆయన సజీవంగా సర్వాంగ సుందరంగా దర్శనమిచ్చారు. బాబాని చూడగానే అప్పాభిల్‌ నోరు వెళ్ళబెట్టాడు. బాబా చిరునవు్వ నవు్వతూ ఆ అమాయకుణ్ణి తన చెంతకు పిలిచి ``భయపడకు బ్రతికే వున్నానులే'' అని వెన్ను తట్టే వరకు అతని పరిస్ధితి అయోమయమే. అనంతరం అసలు విషయమేమిటని కొందరు ప్రశ్నించడంతో ఆ అప్పాభిల్‌ క్రితం రోజు తను చూసిన దృశ్యాన్ని తన భావాన్ని బయటపెట్టాడు. అలా అవయవాలను వేరువేరుగా ఉంచడాన్నే ``ఖండయోగం'' అంటారు.
లోకోత్తర యోగ సమాధి-శవాసనం :

ఇంకొకసారి అంటే 1886 సంవత్సరం, ఆగస్టు 13వ తేదీ రాత్రి వేళ, మహాల్సాపతిని పిలిచి, ``మహల్సా! ఈ శరీరాన్ని మూడు రాత్రుళ్ళు పాటు కాపాడు. తిరిగి వచ్చానా సరేసరి, లేకపోతే మూడు రాత్రుల అనంతరం నా శరీరాన్ని మసీదు కెదురుగా వున్న ఖాళీ స్ధలంలో పాతిపెట్టి గుర్తుగా రెండు జండాలని గుచ్చిపెట్ట''మని చెప్పి అదే రాత్రి సుమారు 10 గంటల సమయానికి నేలమీద శవాసనం చేసి వుండిపోయారు శ్రీ బాబా. క్రమంగా ఊపిరి నిలిచిపోయింది. నాడి ఆడటం మానేసింది. అసలే సాయిబాబా వేసినది శవాసనమేమో నాడీ, ఊపిరీ నిలిచిపోయే సరికి ఆయన దేహం అచ్చం శవంలాగానే కనిపించసాగింది. మహాల్సాపతి అక్కడి నుంచి కదలలేదు. శ్రీ సాయి శరీరానికి కాపలదారుగా అక్కడే ఉండిపోయాడు.
తెల్లవారింది. ఎప్పటిలాగానే బాబా దర్శనమై వచ్చిన భక్తులకి బాబా మృత కళేబరంలా కనిపించారు. వాళ్ళు కంగారు పడ్డారు. ఈ వార్త ఊరంతా పాకింది. ఊరి పెద్దలొచ్చారు మసీదుకి. వాళ్ళతోపాటు ఒక డాక్టర్ని తెచ్చారు. ఆ డాక్టరు బాబా శరీరాన్ని పరీక్షించాడు. ``బతుకుతాడనే ఆశ ఏమాత్రమూ లేదు. ఇతను చచ్చిపోయాడు. అతని ఆత్మ, శాంతి మాయమై విశ్రాంతి పొందునుగాక'' అని చెప్పాడన్నమాట. ఇంకేముంది మనం నిజంగా బతికే వున్నా కూడా డాక్టరుగారు మనం మరణించామని ధృవీకరిస్తే తర్వాతి గతి ఏమిటో ఆలోచించండి. అదే శ్రీ సాయిబాబా కళేబారానికీ ప్రాప్తించబోయింది. ఎవరికి వారే ఆ శవాన్ని తీసివేయాలన్నారు. కాని మహల్సాపతి మాత్రం బాబా శరీరాన్ని తన ఒడిలో చేర్చుకుని ఆ జనాలకు అడ్డం పడ్డాడు.
`` ఈ శరీరాన్ని మూడు రాత్రులు పాటు కాపాడమని సాయి చెప్పాడు. అందువల్ల మూడోరాత్రి గడిచేదాక నేను దీన్ని కాపాడి తీరుతాను. ఒకవేళ మీకు అభ్యంతరమైతే నన్ను కూడా సజీవ సమాధో, సజీవదహనమో చేసెయ్యండి'' అని భీష్మించాడు. దానితో ఈ గొడవ అహ్మదాబాదు జిల్లా కలెక్టరు దాకా వెళ్ళింది. ఆయన… ఇంగ్లీషాయన. ``శ్రీ సాయిబాబా చెప్పినట్లు మూడు రాత్రులు ఆగే తీరా''లన్న ఆయన భక్తుల వాదాన్నీ, డాక్టర్‌ సర్టిఫికెట్‌ కారణంగా అది శవమే కాబట్టి, వెంటనే అంత్యక్రియలు చేయాలి అన్న లౌకికవాదుల వాదాన్ని కూడా విన్నాడు. చివరగా ఆయన `` ఆగవలసింది మూడు రాత్రులేగదా! మీ గొడవల మధ్యన రెండు రాత్రులు ఎటూ అయిపోయాయి. ఇంకొక్క రాత్రి ఆగండి. తెల్లారగానే అంత్యక్రియలు జరిపించండి. ఒకవేళ ఆ ఫకీరు బతికితే మాత్రం వెంటనే నాకు తెలియజెయ్యండి. డాక్టర్లు డెత్‌ సర్టిఫికెట్‌ ఇచ్చిన తర్వాత బతకడం అసాధ్యం. అది ఒక్క ఏసుక్రీస్తుకే సాధ్యమైంది. బతికితే ఈయన కూడా అంతటివాడే'' అన్నాడు కలెక్టరు.
దాంతో రెండు వర్గాల వారూ కలహాలు మానేశారు. తెల్లారగా సాయిబాబా శవానికి అంత్యక్రియలు చేయాలని కొందరు ఆ సన్నాహాలలో వున్నారు కూడా - అంతర్యుద్ధాలు మాత్రం జరగలేదు. మూడు రాత్రులూ గడిచాయీ అనగానే అంటే ఆగస్టు 16 తెల్లవారుజామున సరిగ్గా 3 గంటల వేళప్పుడు సాయిబాబా శరీరంలో ఊపిరి ప్రవేశించింది. నాడి ఆడటం ప్రారంభమైంది. శవంలా పడి వున్న కళేబరం సజీవమైనట్లుగా చలనం ఏర్పడింది. సాయి భక్తుల ఆనందానికి హద్దులూ లేవు.సమాధికర్తల ఆశ్చర్యానికి ఎల్లలూ లేవు. సాయిబాబా పునర్జీవితులయ్యారన్న వార్త కలెక్టరుకు అందింది. ``అయితే సాయిబాబా నిస్సందేహంగా క్రీస్తు అవతారమే'' అని చెప్పారాయన. దీన్ని బట్టి సాయిబాబా యొక్క యోగశక్తి మనకు బోధపడుతోంది గదా!
అంతేకాదు ఈ నాటి సాయి సమాధి కూడా అటువంటి చమత్కారమే తప్ప యితరం కాదు. ఈ క్షణానికీ ఆయన తనను మనసారా పిలిచే భక్తులకు పలుకుతూనే వున్నారు. తనకై తపించే భక్త కోటికి, వారి వారి అర్హతల రీత్యా లీలా దర్శనాన్ని అనుగ్రహిస్తూనే వున్నారు. శరణాగతులకు ఎనలేని సహాయసహకారాలని అందిస్తూనే వున్నారు. కావలసినదల్లా సాయిబాబా పట్ల శ్రద్ధ, విశ్వాసాలు మాత్రమే


’చాగంటి మహాశయా! ఇది మీకు తగునా?’

 
చాగంటి మహాశయా! ఇది మీకు తగునా?’ ఆగస్టు సంచిక కవర్ కధనం సాయి భక్తుల మనోభావాలను ప్రతిబింబించింది. ఒక విధంగా చెప్పాలంటే పీఠాధిపతులతో సరి సమానమైన స్థాయిలో కూచుని ప్రవచించే వారు కోట్లాదిమంది పారాయణ చేసే గ్రంధం గురించి అటువంటి వ్యాఖ్యానాలు చేయడం వారి మాటలలోనే చెప్పాలంటే వారికి అత్యంత గౌరవనీయులైన శంకర భగవత్పాదులు కూడా ’అసహ్యించుకుంటారు’. సాయి తత్త్వమ్ పేరిట వారు చేసిన ప్రవచనం లో ’లోపలికి వస్తూ బాబా వారి పుస్తకం లొ ఒక పేజీ ని అలా తిరగేసాను, ఈకధ వచ్చింది’ అనడంలో  వారి పాండిత్యాన్ని ప్రదర్శించాలన్న తపనా, మరియూ ఒకసారి చూస్తే చాలు మొత్తమ్ చెప్పెయగలను అన్న భావనా వినిపించాయి. విమర్శిస్తున్న భావన రానీయకుండా తన పాండిత్యంతో ’అసహ్యం, తాడూ బొంగరమ్ లేని కధలూ, పాపం, పారాయణ వలన ఏమి లాభం’ వంటి పదాలను అలవోకగా వాడేసారాయన. ఆకలేసిన వాడికే అన్నం విలువ తెలుస్తుంది. అనుభవించిన వారికే సచ్చరిత్ర పారాయణ ఫలం అర్దమవుతుంది.
ఓంసాయి రామ్
సచ్చరిత్ర
ను విమర్శించడం మహా పాపం సాయి భక్తులకు సచ్చరిత్ర భగవద్గీత శ్రీ చాగంటి గారు కోరికలతో సచ్చరిత్ర ను పారాయణ చేయకూడదు అన్నారు . కోరికలు లేని మానవుడు గాలి ని ప్రదేశం విశ్వం లో ఎక్కడలేదు సచ్చరిత్ర మన మానవ జీవితం లో ప్రతి సమస్యకి పరిష్కారం ఒక్క సచ్చరిత్ర లో లభిస్తుంది  ఇది  చాల మంది సాయి భక్తుల అనుభవం సాయి కి సత్చరిత్ర కు తెడా లేదు సత్చరిత్ర ని విమర్శించడం సాయి ని విమర్శించి నట్లీ సతి మనిషిని విమర్శించడం పాపం అని సాయి చెప్పారు   వారికీ సరి అయిన సమాధానం సాయి నుండి తప్పక వస్తుంది సత్చరిత్ర తో సాయి భక్తుల అనుభవాలు సేకరించి సాయి సన్నిధి లోప్ర చు రంచడం సాయి భక్తులందరికీ ఉపయోగారకం ఉంటుందని నా ప్రార్ధన చాగంటి గారు విమర్శించినంత మాత్రమున సత్ చరిత్రని పారాయణం  నిజ మయిన సాయి భక్తులు మానరు సత్చైత్ర ఇంట్లో వుంటే     సాయి వున్న ట్లీ
సాయి ఆశ్రితురాలు శ్రీ లక్ష్మి సుకన్య
నెల్లూరు